అంబర్పేట, ఆగస్టు 3 : రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్లోని తురాబ్నగర్లో మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులకు మంగళవారం పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మైనార్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పి ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని, విద్యాబోధనను ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 12 మాత్ర మే ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి 192 మైనార్టీ పాఠశాలలను నెలకొల్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆర్ఎల్సీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సత్యనారాయణ, విజిలెన్స్ అధికారి బాలకృష్ణ, ప్రిన్సిపాల్ జయశ్రీ, స్కూల్ కో ఆర్డినేటర్లు గీర్వాని, అయేషా, జ్యోతి, దీప, రేణుక, స్వప్న, ఉష, సునీత, భాగ్య ఉన్నారు
కాచిగూడ, ఆగస్టు 3: ప్రజల సహకారంతో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నారాయణగూడ వైఎంసీఏ జంక్షన్ సుందరీకరణ అభివృద్ధ్ది పనులను మంగళవారం పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు బాధ్యతగా కృషి చేస్తున్నామని తెలిపారు. బాటసారులకు, వాహనదారులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు నియోజకవర్గంలోని ప్రతి జంక్షన్ను అభివృద్ధ్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా పలు జంక్షన్లోని సర్కిల్స్ మధ్య గార్డెన్, ఫౌంటేన్, వివిధ రకాల పూల మొక్కలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాలుష్య రహిత ప్రకృతిని అందించేందుకు పచ్చని చెట్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్, మధుసూదన్రెడ్డి, మన్నె శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్యెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నింబోలిఅడ్డా ప్రాంతానికి చెందిన శ్రీశైలం కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధప డుతూ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.ఈ మేరకు శ్రీశైలంకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును మంగళవారం అతని కుటుంబ సభ్యులకు ఎమ్యెల్యే అందజేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్లూరి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.