మారేడ్పల్లి, ఫిబ్రవరి 5: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జి. సాయన్న తెలిపారు. కంటోన్మెంట్ నాలుగో వార్డు గాంధీకాలనీలో రూ. 25 లక్షల వ్యయం తో నిర్మించిన కమ్యూనిటీహాల్ను ఎమ్మెల్యే జి. సాయన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…బస్తీల్లో ఇటువంటి కమ్యూనిటీ సముదాయాల నిర్మాణాల వల్ల స్థానికులకు ఎంతో స్వాంతన చేకూరుతుందన్నారు. ఏ కార్యం నిర్వహించుకోవాలన్నా వేలు, లక్షల్లో అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి నగరంలో నెలకొందన్నారు.
ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రాంతాల వారిగా సకల సౌకర్యాలతో కమ్యూనిటీహాళ్లు ,మల్టీపర్పస్ ఫంక్షన్హాలు నిర్మిస్తూ తక్కువ మొత్తంలో శుభకార్యాలు జరుపుకునే వెసులుబాటు కల్పిస్తుందన్నారు. దీంతో తక్కువ మొత్తంలోనే వివాహాలు, ఇతరత్ర కార్యక్రమాల్లో జరుపుకునే అవకాశం ఉందన్నారు. కంటోన్మెం ట్ నియోకవర్గంలో బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా కమ్యూనిటీహాళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ బోర్డు సభ్యురా లు నళిని కిరణ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్. శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు , పనస సంతోష్, సదానంద్గౌడ్, ఒదెల అజెయ్, బస్తీ అధ్యక్షుడు రాజేందర్, నివేదిత తదితరులు పాల్గొన్నారు.