మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజవకర్గం కొండాపూర్ డివిజన్ సిద్ధిక్ నగర్కు చెందిన ప్రభుదాసుకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 2 లక్షల ఆర్థిక సాయం మంజూరు పత్రాలను విప్ ఆరెకపూడి గాంధీ శనివారం తన నివాసంలో అందించారు.
అలాగే కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన శ్రీనివాసప్రసాద్కు మంజూరైన రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం మంజూరు పత్రాలను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సాయిబాబాలతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ శనివారం తన నివాసంలో బాధిత కుటుంబాలకు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వీరేశం, పెద్ద భాస్కర్రావు, చంద్రకాంత్రావు పాల్గొన్నారు.