ఎల్బీనగర్, ఫిబ్రవరి 18 : కొత్తపేటలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్(Tims Hospital)ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. కొత్తపేట గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ పనులను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునాతన పద్ధతుల్లో నిర్మిస్తున్న ఈ దవాఖానతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలోదేవాలయం, మజీద్ నిర్మాణం కూడా చేయిస్తున్నామ పేర్కొన్నారు. రోగుల కోసం వచ్చే వారి కోసం మరో ఐదు అంతస్తుల భవనాన్ని కూడా నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు.
హాస్పిటల్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు, భద్రతను పాటిస్తూ చేపట్టాలని సుధీర్రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనంతుల రాజారెడ్డి, తూర్పాటి చిరంజీవి, మధుసాగర్, కిరణ్, బంటి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.