Ragidi Laxma Reddy | మన్సూరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని.. కానీ ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు. రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు.
శుక్రవారం మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని.. రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు.