ఖైరతాబాద్, నవంబర్ 8 : తొమ్మిదిన్నరేండ్లుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు తొలుత ఖైరతాబాద్ బడా గణేశ్ చౌరస్తా నుంచి అశేష బీఆర్ఎస్ శ్రేణుల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ ఎంఎస్.ప్రభాకర్రావుతో కలిసి ప్రారంభించారు. స్థానిక మహంకాళి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దానం ఖైరతాబాద్ రైల్వే గేటు మీదుగా జీహెచ్ఎంసీకి వెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్న నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం ద్వారా సంక్షేమ పథకాలు కొనసాగించుకోవాలని, ప్రతిపక్ష పార్టీలకు అవకాశమే లేకుండా సీఎంగా కేసీఆర్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ, వెంకటేశ్వరకాలనీ, హిమాయత్నగర్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్లు వనం సంగీత యాదవ్, మన్నె కవిత, మహాలక్ష్మీ రామన్గౌడ్, వెల్దండ వెంకటేశ్, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె.ప్రసన్నరామ్మూర్తి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు మహేశ్ యాదవ్, కృష్ణ యాదవ్, ఖైరతాబాద్, సోమాజిగూడ డివిజన్ల అధ్యక్షులు అరుణ్కుమార్, ఎస్కె అహ్మద్, ప్రధాన కార్యదర్శి పి.నాగారజు, మహేశ్ యాదవ్, మహేందర్ బాబు, ప్రవీణ్ కుమార్, బీసీ సెల్ నాయకులు ఆనంద్ గౌడ్, రజినీ, గయాసుద్దీన్, తాండ్ర మేఘన తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్, నవంబర్ 8 : ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనతోపాటు తన కుటుంబసభ్యుల పేరుతో రూ.41.33కోట్ల విలువైన స్థిరాస్థులు, షేర్లు, పెట్టుబడులున్నాయని, తనతోపాటు తన కుటుంబసభ్యులకు రూ.27కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారం ఆభరణాలు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన ఆస్తుల్లో బంజారాహిల్స్ రోడ్ నం.3లో సుమారు రూ.25కోట్ల విలువైన ఇల్లుతోపాటు వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లాల్లో 44 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని తెలిపారు. తనతోపాటు తన భార్య దానం అనిత పేరుతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, వ్యక్తులకు చెల్లించాల్సిన రూ.47.55 కోట్ల అప్పులున్నాయని అఫిడవిట్లో తెలిపారు.