బంజారాహిల్స్/ ఖైరతాబాద్/హిమాయత్నగర్, అక్టోబర్ 30 : శాసనసభ ఎన్నికల్లో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. సోమవారం ఖైరతాబాద్ డివిజన్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, లక్ష్మీనగర్, జాగిర్దార్బాడా, పూసలబస్తీ, నెహ్రూనగర్, మహాభారత్నగర్, బీజేఆర్నగర్, మారుతీనగర్లో ఎమ్మెల్యే దానం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి మ్యానిఫెస్టోలను ఓటర్లకు అందజేశారు. పదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్న రామ్మూర్తి, బీఆర్ఎస్ నాయకులు మహేశ్ యాదవ్, సురేందర్, రాజు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. హిమాయత్నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఎన్నికల ప్రచారంను ప్రారంభించారు.స్థానికులు మంగళ హారతి ఇచ్చి దారి పొడువునా పూలవర్షం కురిపించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, వేంకటేశ్వరస్వామి ఆశీర్వాదంతో తాను మరోసారి ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్కార్డుతో పాటు రూ.400లకే వంటగ్యాస్ ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యాదగిరి సుతారి,యతిరాజు, అశోక్కుమార్, రమేష్యాదవ్, పి.ప్రభాకర్గౌడ్, ఆర్. రాజేందర్ కుమార్, నందు,ఎన్.రాజేంద్రప్రసాద్, అరుణ, శ్రీకాంత్, శ్రీనాథ్, కళ, మన్సూర్,అశ్విన్, యాస్మిన్,హజార్,సత్యనారాయణ పాల్గొన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టికెట్స్ కేటాయింపులోనే నీరసించిపోయాయని, నామినేషన్లు వేయకముందే సగంమంది నాయకులు పార్టీని వీడుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ డివిజన్ ఇందిరానగర్, గౌతమ్నగర్, వినాయక్నగర్, దుర్గాభవానీగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్, నాయకులు మామిడి నర్సింగరావు, బోజిరెడ్డి, కిరణ్. సునీల్.విష్ణునాయక్. శంకర్. నర్సింహ. ఎల్లయ్య, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.