HomeHyderabadMla Candidate Madhavaram Krishna Rao Road Show In The Division
అభివృద్ధే మన కులం.. సంక్షేమమే మన మతం
అభివృద్ధే మన కులం.. సంక్షేమమే మన మతం.. అనే నినాదంతో అభివృద్ధి చేపట్టి నిరూపించినట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డితో కలిసి ఆయన రోడ్ షో చేపట్టారు.
అభ్యర్థి మాధవరం కృష్ణారావు డివిజన్లో రోడ్ షో
బాలానగర్, నవంబర్ 19 : అభివృద్ధే మన కులం.. సంక్షేమమే మన మతం.. అనే నినాదంతో అభివృద్ధి చేపట్టి నిరూపించినట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డితో కలిసి ఆయన రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు బొట్టు పెట్టి హారతిచ్చి, స్వాగతం పలికి పూలమాలలు వేసి నీరాజనాలు పలికారు. మహిళా కళాకారులు చేసిన నృత్యాలు ఆహుతులను ఆళరించాయి. డప్పుల ధరువులు ఔరా అని పించాయి. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ రవీరందర్రెడ్డి డప్పు కళాకారులతో కలిసి డప్పు కొట్టి చూపరులను ఆకర్శించారు. ఫిరోజ్గూడలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ రవీందర్రెడ్డిలు పూలమాలలు వేసి వేలాది మందితో కలిసి రోడ్షో ప్రారంబించారు.
ఫిరోజ్గూడ, గీతానగర్, నవజీవన్నగర్, వినాయక్నగర్, గణేశ్నగర్, సాయినగర్, చెరబండరాజుకాలనీ, రాజుకాలనీ, బాలానగర్ కనకదుర్గ ఆలయం మీదుగా కోమటిబస్తీ, శ్రీశ్రీనగర్, ఇందిరానగర్, రాజీవ్గాంధీనగర్ లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాండూరి నరేంద్రాచార్య, మందడి సుధాకర్రెడ్డి, పంజా రాంచందర్ ముదిరాజ్, ఎండీ ఖాజా, శంకర్గౌడ్, నర్రా దేవేందర్రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, బీఎన్ స్వామి, ప్రేం కుమార్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి ప్రధాన్యతా..
మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రధాన్యతనిస్తుందని మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో మైనార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయనతో పాటు డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లా పేరుతో మోతినగర్ డివిజన్ను అల్లాపూర్ డివిజన్గా మార్చి వేయించినట్లు తెలిపారు. మైనార్టీల ఫంక్షన్హాల్ కోసం స్థలం కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎండీ గౌస్, కూకట్పల్లి నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఎజాజ్, ఓల్డ్బోయిన్పల్లి బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇర్ఫాన్, జహంగీర్ పాల్గొన్నారు.
తండ్రి కోసం తనయుడు ప్రచారం..
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనయుడు మాధవరం సందీప్రావు ఓల్డ్బోయిన్పల్లిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ కుమారుడు ముద్దం మల్లికార్జునయాదవ్తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. కారుగుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును గెలిపించాలని ఓటర్లను కోరారు. క్యాక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నేను లోకల్.. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి
కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 19 : కూకట్పల్లి గ్రామంలో సామాన్య ఓటరు నుంచి నాయకుడిగా ఎదిగానని స్థానికంగా ప్రజల కష్టసుఖాలలో అండగా ఉండే తనను ఎన్నికల్లో మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మరోసారి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్పల్లి గ్రామంలోని ఈస్ట్ కమాన్, సాయిబాబా కాలనీలో ప్రజలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, వాసుదేవరావు, సంతోష్, ప్రభాకర్, బొట్టు విష్ణు తదితరులు ఉన్నారు.