అంబర్పేట/కాచిగూడ/గోల్నాక, నవంబర్ 9: అంబర్పేట నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ గురువారం అట్టహాసంగా తన నామినేషన్ను దాఖలు చేశారు. కాచిగూడ లింగంపల్లి చౌరస్తా నుంచి 10వేల మందితో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. అంబర్పేటలో రెండవసారి గులాబీ జెండా ఎగరవేస్తా మని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి గండ్ర మోహన్రావు, పార్టీ ఎన్నికల సమన్వయకర్త కె.పద్మావతిడీపీరెడ్డి, కార్పొరేటర్లు ఇ.విజయ్కుమార్గౌడ్, బి.పద్మావెంకటరెడ్డి, దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, డివిజన్ అధ్యక్షులు సీహె చ్ చంద్రమోహన్, సిద్ధార్థ్ ముదిరాజ్, భీష్మాదేవ్, మేడి ప్రసాద్, డి. శిరీషా ఓంప్రకాశ్యాదవ్, దిడ్డి రాంబాబు, బిల్డర్ ప్రవీణ్, పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా… ఆట పాటల మధ్యన లింగంపల్లి నుంచి బర్కత్పుర, ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా, తిలక్నగర్, శివంరోడ్డు, అయ్యప్పటెంపుల్, రెడ్బిల్డింగ్, కుమ్మరివాడిల మీదుగా అంబర్పేట తాసీల్దార్ కార్యాలయంలో ఆర్వో అపర్ణకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఈ సందర్భంగా దారిపోడువునా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యక్తి కాదు పార్టీ ముఖ్యమని, పార్టీ కోసం పని చేయడానికి అంతా సిద్ధమేనని నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ఈ నామినేషన్ ర్యాలీలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.