గోల్నాక, నవంబర్ 10 : అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేశ్ తన ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశా రు. ఇప్పటికే అంబర్పేట నియోజకవర్గంలోని అంబర్పేట, బాగ్ అంబర్ పేట, గోల్నాక, నల్లకుంట, కాచిగూడ డివిజన్లలోని పలు ప్రాంతాలను సగం చుట్టేసి ప్రచారంలో ముందున్న కాలేరు వెంకటేశ్ శుక్రవారం అంబర్ పేట డివిజన్ లో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు.
న్యూపటేల్ నగ ర్ బుజిలి మహంకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో పాటు వందలాది మంది పార్టీ శ్రేణులతో కలసి ఆయన ఇం టింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, గత ఐదేండ్లుగా తాను చేసిన అభివృద్ధి పనులతో పాటు బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయ్యాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్కు అడుగడుగునా మహిళలు మంగళ హారతులతో ఘనం స్వాగతం పలుకుతూ తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, ఎర్రబోలు నరసింహారెడ్డి, మోర శ్రీరాములు తదితరులు ఉన్నారు.