మణికొండ/బండ్లగూడ /శంషాబాద్ రూరల్/ మైలార్దేవ్పల్లి/నవంబర్ 16 : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మణికొండ, పుప్పాలగూడ, నెక్నాంపూర్, వివిధ కాలనీల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటా ప్రచారాలను రెండు వారాలుగా కొనసాగిస్తున్నారు. మణికొండ మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షురాలు లక్ష్మీశ్రీ, మహిళా విభాగం అధ్యక్షురాలు రూపారెడ్డి, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ప్రత్యూష ఫౌండేషన్ చైర్పర్సన్ సరోజినిల ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని అన్ని కాలనీలు, వార్డులల్లో కారు గుర్తుకే ఓటువేయాలంటూ ప్రజలు అభ్యర్థిస్తున్నారు.