చర్లపల్లి, మే 30 : రాష్ట్రంలోనే ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని సాయినగర్, నాగార్జుననగర్, ఆదర్శనగర్ కాలనీలో సుమారు 2కోట్ల నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కోట్లాది నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని, ముఖ్యంగా కాలనీల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టి త్వరతగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. చర్లపల్లి డివిజన్లో కోట్లాది నిధులు కేటాయించి భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్లతోపాటు కాలనీల్లో ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేశామని, పనులు పూర్తికానీ కాలనీల్లో నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని తెలిపారు.
అదేవిధంగా డివిజన్లో పారిశుధ్య పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కాలనీల్లో వీధిదీపాల నిర్వహణ మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్వరూప, ఎస్సై సాయికుమార్, ప్రసాద్, మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, నాయకులు సప్పిడి శ్రీనివాస్రెడ్డి, బద్దం భాస్కర్రెడ్డి, నాగిళ్ల బాల్రెడ్డి, జాండ్ల ప్రభాకర్రెడ్డి, వినోద్, నారెడ్డి రాజేశ్వర్రెడ్డి, శ్రీకాంత్యాదవ్, గంప కృష్ణ, సారా అనిల్, శ్రీకాంత్రెడ్డి, యాదగిరి, నర్సింగ్, కరీం తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్లో సమస్యల పరిష్కారానికి కృషి
కుషాయిగూడ మార్కెట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని కుషాయిగూడ మార్కెట్ను ఆయన సందర్శించి మార్కెట్లోని ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో నూతన షెడ్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా మార్కెట్లో ఫ్లోరింగ్ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. మార్కెట్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, నాయకులు బద్దం భాస్కర్రెడ్డి, లేతాకుల రఘుపతిరెడ్డి, మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షుడు అకిడి శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి భూపతి వెంకటేశ్, సభ్యులు బెల్లం కృష్ణ, దూడల మహేశ్, బానోతు రాములు నాయక్, సుధాకర్, ఆంజనేయులు, రవీందర్, రవినాయక్, సూర్యకుమార్, యాదగిరి, రమేశ్, బీఆర్ఎస్ నాయకులు అనిల్, గంప కృష్ణ, వినోద్, చంద్రమౌళి, వెంకటేశ్, రాకేశ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి
ఉప్పల్, మే 30 : నియోజకవర్గంలోని కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడ డివిజన్ రవీంద్రనగర్లోని ఎస్ఆర్ అపార్ట్మెంట్ ప్రాంతంలో ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుంచి రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. కాలనీల్లో సమస్యలు గుర్తించి, తగిన పరిష్కార చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని, కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీశ్, జలమండలి మేనేజర్ ఆసీఫ్ అలీ, ఎస్డబ్ల్యూ డీఈ చందన, సూపర్వైజర్ సుదర్శన్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి, కొంగల శ్రీధర్, నగేశ్, దాచేపల్లి శ్రీధర్, కాలనీవాసులు మధుసూదన్రెడ్డి, నరసింహారెడ్డి, సుధాకర్రెడ్డి, వెంకట్రామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, రామిరెడ్డి, భాగ్యలక్ష్మి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.