చర్లపల్లి, జూన్ 6 : రాష్ట్రంలో అత్యాధునిక మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని పారిశ్రామికవేత్తల భవనంలో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమల రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, నిరంతరం విద్యుత్ కోతలతో నష్టాలలో కూరుకుపోయా యని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సౌకర్యం కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ ఐపాస్ చట్టం ద్వార సులభంగా స్థలాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులను మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటుకు వివిధ రకాల రాయితీలను కల్పించిందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుందని, ముఖ్యంగా దళితబంధు పథకం ద్వార పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేసిందని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలోని పారిశ్రామికవాడల అభివృద్ధి కోసం పారిశా మికవేత్తలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి ప్రగతిశీల పారిశ్రా మికవాడలుగా తీర్చిదిద్దారని అన్నారు. పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడుల కోసం పలు పాలసీలను ప్రవేశపెట్టారని, తొమ్మిదేండ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను కొద్ది కాలంలోనే అమలు చేశారని తెలిపారు. అనంతరం సీఐఏ భవనం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్రెడ్డ్డి, ఐలా అధ్యక్షుడు రోషిరెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, శిరీషాసోమశేఖర్రెడ్డి, దేవేందర్రెడ్డి, ఉప్పల్, కాప్రా కమిషనర్లు అరుణకుమారి, శంకర్,కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, సీఐఏ అధ్యక్షడు గోవింద్రెడ్డి, పారిశ్రామికవేత్తలు గోపాల్రావు, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, లేతాకుల రఘుపతిరెడ్డి, బన్నాల ప్రవీణ్ముదిరాజ్, జాండ్ల ప్రభాకర్రెడ్డి, నాగిళ్ల బాల్రెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.