కాప్రా, ఏప్రిల్ 18: వేసవిలో మంచి నీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బోర్వెల్, తాగునీటి పైపులైన్ల సమస్యలు సత్వరం పరిష్కరించాలని జలమండలి అధికారులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆదేశించారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జలమండలి ఉన్నతాధికారులు, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా నీటి సరఫరా మెరుగుపర్చాలని, బోర్వెల్స్, పురాతన పైపులైన్లను ఆధునీకరించాలని అన్నారు.
భూగ ర్భ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించి, డ్రైనేజీ నుంచి తీసిన సిల్ట్ను ఎప్పటికప్పుడు తొలగింపజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీర్పేట్ డివిజన్ కా ర్పొరేటర్ ప్రభుదాస్ .. కైలాసగిరిలో మంచినీటి ట్యాంకు కు అదనపు మోటర్ 20 హెచ్పీ మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు స్వర్ణరాజు, శిరీషా సోమశేఖర్రెడ్డి, బొంతు శ్రీదేవి, జెర్రిపోతుల ప్రభుదాస్, దేవేందర్రెడ్డి, శాంతిసా యిజెన్శేఖర్, గీతా ప్రవీణ్ ముదిరాజ్, బండారు శ్రీవాణి వెంకట్రావు, మాజీ కార్పొరేటర్లు కొత్తరా మారా వు, పావనీ మణిపాల్రెడ్డి, ధన్పాల్ రెడ్డి, జలమండలి డైరెక్టర్ స్వామి, జీఎం సంతోష్కుమార్, డీజీఎంలు సతీశ్కుమార్, రజనీకాంత్రెడ్డి, మేనేజర్లు వేణుగోపాల్, సత్యనారాయణ, స్రవంతి, ఆసిఫ్, రోహన్, రవీందర్, సందీప్ పాల్గొన్నారు.