నియోజకవర్గం పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఏఎస్రావునగర్ డివిజన్, శ్రీనివాస్నగర్ కాలనీకి చెందిన సంక్షేమ సంఘం నూతన కమిటీ నాయకులు ఎమ్మెల్యే సుభాష్రెడ్డిని కలిశారు. సమస్యలను ఎమ్మెల్యేకు వివరించి, అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గం పరిధిలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీనివాస్నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధులు కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, టీఆర్ఎస్ నాయకులు మణిపాల్రెడ్డి, ఏనుగు సీతారామిరెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గూడురు సుదర్శన్రెడ్డి, నాగు, నాయకులు మోహన్, సంతోష్, ఉపేందర్, ఆనంద్, కృష్ణారెడ్డి, పాండు, ఓంప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్ ప్రధాన రహదారిలోని నల్లపోచమ్మ దేవాలయంలో భక్తులకు మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న సొంత ఖర్చులతో సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం నల్ల పోచమ్మ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం వద్ద మరుగుదొడ్లు, తాగునీటి వసతి, తదితర సౌకర్యాల నిమిత్తం అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గంధం నాగేశ్వర్రావు, గడ్డం రవికుమార్, వనంపల్లి గోపాల్రెడ్డి, గరిక సుధాకర్, మధుసూదన్రెడ్డి, జగదీశ్కుమార్, శ్రీనివాస్, శంబుసాయి, ఆలె రమేశ్, రమేశ్, బోసాని పవన్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణ పనులపై ఎమ్మెల్యేను కలిసిన ప్రతినిధులు
ఉప్పల్, ఏప్రిల్ 6 : హెచ్ఎంటీనగర్ పెద్దచెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా కల్యాణపురి నుంచి హెచ్ఎంటీనగర్ చెరువు మీదుగా రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని హెచ్ఎంటీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిశారు. ఈమేరకు హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. కాలనీవాసుల ప్రయోజనాల దృష్ట్యా కోర్టు ఉత్తర్వులు పాటించే విధంగా చూడాలన్నారు. అనంతరం కోర్టు ఉత్తర్వుల కాపీని ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయిజెన్ శేఖర్, కాలనీ అధ్యక్షులు బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి యాదగిరిరెడ్డి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.