చర్లపల్లి, ఆగస్టు3 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి.. ఉప్పల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. చర్లపల్లి డివిజన్, భగవాన్ కాలనీ సంక్షేమ సం ఘం ప్రతినిధులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపట్టనున్నామని, ముఖ్యంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలు కాలనీల్లో నెలకొన్న డ్రైనే జీ, మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు కాలనీలో రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే పారిశుధ్య పనులను వేగవంతం చేసి.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత జాండ్ల ప్రభాకర్రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, దామోదర్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.