ఉప్పల్/మల్లాపూర్, జూలై 29 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలాంటిదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చిలుకానగర్ డివిజన్కు చెందిన నాగమణికి రూ.16 వేలు, రోజకు రూ.15 వేలు, ఓబయ్యకు రూ.54,500, మల్లాపూర్ డివిజన్కు చెందిన బాలస్వామికి రూ.60 వేలు, రమేశ్కు రూ.24 వేలు, రవీందర్కు రూ.40 వేల చెక్కులను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్లు బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, పన్నాల దేవేందర్రెడ్డిలతో కలిసి అందజేశారు.సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద మధ్య తరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందిన బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేసి ఆదుకుంటున్నామన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచి, వారి ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తు న్న సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని చిలుకానగర్, మల్లాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, దేవేందర్రెడ్డిలు అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, పల్లా కిరణ్కుమార్రెడ్డి, గరిక సుధాకర్, శ్రావణ్, జగన్, శ్రీనివాస్, మహమూద్, శివ, వినీశ్రెడ్డి, పీరూనాయక్, సుధాకర్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.