ఉప్పల్, మార్చి 21 : కాలనీల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉప్పల్(Uppal) ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) అన్నారు. ఉప్పల్ లక్ష్మీనారాయణకాలనీలోని డ్రైనేజీ సమస్యలు(Drainage problems) పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు గురువారం ఎమ్మెల్యేను కలిశారు. ఈసందర్భంగా సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు పూర్తిచేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు.
కాలనీలలో మౌలిక సమస్యలను సత్వరం పరిష్కరించేవిధంగా సమన్వయంతో ముందుకు సాగు తామన్నారు. కాలనీలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరించేవిధంగా చూస్తామన్నారు. కాలనీలలో నీటి, డ్రైనేజీ, రోడ్డు ఇబ్బందులు లేకుండా తగిన నిధులు తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాయసం గోపాల్, బొడ్డు రవీందర్, యాదగిరి యాదవ్, శివారెడ్డి, శివకుమార్, రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.