కాప్రా, ఏప్రిల్ 28 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి-షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా పేద ప్రజలకు ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం కాప్రా తహశీల్ కార్యాలయంలో జరిగిన కల్యాణ లక్ష్మి-షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా విచ్చేసి 80 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెక్కుల పంపిణీ పారదర్శకంగా జరుగాలని, సీఎం రేవంత్రెడ్డి చెప్పిన విధంగా రూ.లక్షా నూట పదహారుతో పాటు తులం బంగారం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో కాప్రా తహశీల్దార్ బైరెడ్డి రాజేష్, డీటీ ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ కొత్తరామారావు, ఏఎస్రావునగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కాసం మహిపాల్రెడ్డి, మహేష్, రహీం, తదితరులు పాల్గొన్నారు.