కొండాపూర్, ఆగస్టు 4 : అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డులను అందజేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డితో కలిసి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కార్డులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్రావు, లక్ష్మినారాయణ, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, గోవర్ధన్రెడ్డి, ప్రీతమ్, వెంకటేశ్, శ్రీకాంత్రెడ్డి, నాగరాజు, రాజశేఖర్రెడ్డి, ప్రవీణ్, దాస్ పాల్గొన్నారు.
మాదాపూర్, ఆగస్టు 4: నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అర్హులైన వారికి ఆహార భద్రత కార్డులను అందిస్తున్నదని కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని వార్డు కార్యాలయం, ఆదిత్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్తో కలిసి 700 ఆహార భద్రత కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజల పక్షపాతి అని, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార భద్రత కార్డులను అందజేస్తున్నారని తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో అర్హులైన పేద ప్రజలను గుర్తించి ఒక్కరోజే 700 మందికి రేషన్ కార్డులను అందజేసినట్లు తెలిపారు. ఈ క్యాక్రమంలో పార్టీ నాయకులు కృష్ణ, గోకుల్ ప్లాట్స్ వార్డు సభ్యులు గుమ్మడి శ్రీనివాస్, ఇజ్జత్నగర్ వార్డు సభ్యులు రాంచెందర్, సాంబశివరావు, ముక్తార్, కాసీం, కృష్ణ కాలనీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, బాబుమియా, లియాకత్, రహీం, మల్లారెడ్డి, రేషన్ డీలర్లు మహేశ్, అల్తాఫ్, చైతన్య, ప్రవీణ్, రాణి, ఉమాదేవి, శ్యామ్, మాతృశ్రీనగర్ కాలనీ అధ్యక్షుడు అనీల్ పాల్గొన్నారు.
మియాపూర్, ఆగస్టు 4 : డివిజన్లో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. డివిజన్ పరిధిలోని జేపీనగర్ కల్యాణ మంటపంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు అన్నిరాజు, డీలర్లు అమర్నాథ్, వెంకటేశ్, యాదయ్యగౌడ్, రాజేశ్, వీరసింగ్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
కొండాపూర్, ఆగస్టు 4 : బోనాల పండుగ ఉత్సవాలలో భాగంగా దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను బుధవారం కొండాపూర్ డివిజన్ ప్రశాంత్నగర్ కాలనీలోని కట్ట మైసమ్మ భూ లక్ష్మమ్మ దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అందజేశారు.