మియాపూర్, జనవరి 11 : నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి పండుగ ప్రజలకు సుఖశాంతులను.. పాడి పంటలను అందించాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆకాంక్షించారు. ప్రజలందరు సోదరభావంతో ముందుకు సాగాలన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చందానగర్ బీఆర్ఎస్ నేత గుడ్ల ధనలక్ష్మి నేతృత్వంలో బీఆర్ఎస్ మహిళా నేతలు, మియాపూర్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే గాంధీని గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్ష లు తెలిపారు.
నియోజకవర్గ ప్రజలందరి బాగోగుల కోసం తాను కృషి చేస్తానని గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరలక్షి, భవానీ, మాధవి, బాలుచౌదరి, నరేశ్, జయలక్ష్మి, శ్రీధర్, సాంబయ్య, మల్లిఖార్జున్, రత్నకిశోర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.