మాదాపూర్, నవంబర్ 25: ఇంటింటికి తాగునీటిని అందించి ప్రజల దాహర్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. జలమండలి ఆధ్వర్యంలో హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్, రాం నగర్, ఓల్డ్ హఫీజ్పేట్, యూత్ కాలనీలో రూ.90 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మాంజీరా తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ వి. పూజిత గౌడ్, మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస్ రావుతో పాటు జలమండలి అధికారులతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారాన్ని అందించేందుకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ఎన్నో ఏండ్లుగా తీరని సమస్య నేటితో తీరిందని, కాలనీ వాసుల కోరిక మేరకు పాత పైప్లైన్ల స్థానంలో కొత్త పైప్లైన్లను వేయడం జరుగుతున్నదన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి నల్లా కనెక్షన్ ద్వారా నీటి సరఫరాను అందించడం జరుగుతుందన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా పవర్ బోర్ల ద్వారా కూడా సరఫరా చేస్తున్నామని, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి సీజీఎం విజయ్రావు, డీజీఎం నాగప్రియ, మేనేజర్ పూర్ణేశ్వరి, హఫీజ్పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, కరుణాకర్ గౌడ్, బాలింగ్ యాదగిరి గౌడ్, వెంకటేశ్ గౌడ్, నరేందర్ గౌడ్, సయ్యద్ సాధిక్ హుస్సేన్, శ్రీనివాస్ గౌడ్, బాబు గౌడ్, రామకృష్ణ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.