మియాపూర్, జూన్ 24 : ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా సీఎం సహాయ నిధి పథకం నిలుస్తున్నదని, ఈ పథకం ద్వారా తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ పేదలు హాయిగా జీవితాన్ని గడుపుతున్నారని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజవకర్గంలోని ఆయా డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ.5,49,500ల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో విప్ గాంధీ గురువారం తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్యాదవ్, చంద్రారెడ్డి, సాంబశివరావు, నరేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాల ఆర్పీలకు ఏకకాలంలో జీతాలు మంజూరైన సందర్భంగా ఆర్పీలు విప్ అరెకపూడి గాంధీని ఆయన నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఎదిగేలా ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు. ఇందుకోసం కీలకంగా పని చేస్తున్న మహిళా సంఘాలు మరింతగా అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్పీల కృషి అభినందనీయమని విప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సంజీవరెడ్డి, ఆదర్శ్రెడ్డి, ఆర్పీలు మంజుల, పద్మ, స్వప్న, వనజ, వరలక్ష్మి, మంజుల, మిత్రవింద, శోభారాణి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.