హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటి ముందే వినాయకుడి నిమజ్జనం చేసే మూడు వాహనాలను టీఆఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్ సాగర్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గణేష్ నవరాత్రుల సందర్భంగా 6 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేశామన్నారు. మొట్టమొదటి సారిగా ఎకో ప్రెండ్లీ గణేష్ నిమజ్జనం వాహనాలను నగరంలో ప్రారంభించడం పట్ల నిర్వాహకులను మంత్రి అభినందించారు.