హైదరాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు వరం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో 113 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడిబిడ్డల పెండ్లిళ్లకు లక్షా 116 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు.
ఆడబిడ్డల వివాహాలు భారం కావొద్దని సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.