హైదరాబాద్ : సికింద్రాబాద్లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన స్వర్ణ బంధన మహా కుంభాభిషేకంలో శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రితో పాటు పద్మారావు నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.