హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. శనివారం సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు వార్డులలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 50 సంవత్సరాల లో జరగని అభివృద్ధి 9 సంవత్సరాల లో జరిగిందని పేర్కొన్నారు.
ఈ నియోజక వర్గం నుంచి గెలిచి ముఖ్యమంత్రి, మంత్రులుగా పని చేసిన వారు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. అనేక దీర్ఘకాలిక ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) సహకారంతో పరిష్కరించామని వెల్లడించారు.సుభాష్ నగర్లో ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న హైటెన్షన్ విద్యుత్ లైన్ సమస్యను పరిష్కరించామని వివరించారు. అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులైనా మంజూరు చేయడానికి వెనుకాడబోమని పేర్కొన్నారు.