హైదరాబాద్ : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే బస్తీ దవాఖానలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు బస్తీ దవాఖానలు, ఆరోగ్య మహిళా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వంపెద్దపీట వేసిందన్నారు.
కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్యం కాపాడటం కోసం ఆరోగ్య మహిళా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వైద్య సేవలు, మందులు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితన తర్వాత ప్రభుత్వ దవాఖానల రూపురేఖలే మారిపోయాయని చెప్పారు.
అలాగే పేద ప్రజలు అధికంగా ఉండే బస్తీలలోనే బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమలో కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేష్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.