కాచిగూడ,ఆగస్టు 8: భావసార్ క్షత్రీయ కుల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. కాచిగూడ సుందర్నగర్లోని భావసార్ భవన నిర్మాణానికి రూ.25 లక్షల రూపాయల నిధులు మం జూరుచేయాలని కోరుతూ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో భావసార్ క్షత్రియ సమాజ్ ట్రస్టీ అశ్విన్కుమార్ వినతి పత్రాన్ని సచివాలయంలో మంగళవారం అందజేశారు. సానుకులంగా స్పందించిన మంత్రి తలసాని తక్షణమే నిధులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని కులాలను ఆదరిస్తుందని, తెలంగాణ రాష్ట్రం లో 60 ఏండ్లలో లేని అభివృద్ధి కేవలం 9 ఏండ్లల్లోనే సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశాడని వెల్లడించారు.
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ కిషన్రెడ్డి ఎంపీగా గెలిచి అంబర్పేట ప్రజలకు ఇప్పటి వరకు ఒరగ పెట్టింది ఏమిలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమానంగా ఉండే ఎకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కిషన్రెడ్డి హయాంలో లేని అంబర్పేట అభివృద్ధి, సంక్షేమాన్ని నాలుగేండ్లల్లో ప్రజలతో సన్నిహితంగా ఉంటూ అన్ని రంగాల్లోఅభివృద్ధి చేసినట్లు అన్నారు. కిషన్రెడ్డి హయాం లో అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని,ఇప్పడు ఏ మోహం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతాడని ఆయన మండిపడ్డాడు.