కంటోన్మెంట్/మారేడ్పల్లి/అడ్డగుట్ట/బొల్లారం, జూలై 16 : బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని చారిత్రాత్మక చరిత్ర కలిగిన చిలకలగూడ శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి ఆదివారం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రభు త్వం తరుపున పట్టు వస్ర్తాలను సమర్పించాడు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన పూజలను చేశారు. మొదటగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు పద్మారావు గౌడ్కు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం పద్మారావుగౌడ్ మాట్లాడుతూ.. బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు అని ఆయ న అన్నారు. బోనాల వేడుకల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం జలమండలి ఆధ్వర్యంలో మంచినీటి క్యాంప్ను, వైద్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. బోనాల వేడుకల సందర్భంగా సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ అమ్మవారికి మహిళలతో కలిసి వచ్చి బోనాలను సమర్పించారు. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసూరి సునీత, బీఆర్ఎస్ యువనేతలు కిశోర్గౌడ్, రామేశ్వర్గౌడ్, సాయికిరణ్ యాద వ్ పాల్గొన్నారు.
మధురనగర్లోని శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో బోనా ల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ గుర్రం పవన్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పవన్కుమార్గౌడ్ మంత్రి తలసానిని శాలువాతో సత్కారించారు. అనంతరం అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించినట్లు తెలిపారు.
మాస బోనాలను పురస్కరించుకొని హైదరాబాద్లోని అక్కన్న, మాదన్న మహంకాళీ అమ్మవారిని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు డిప్యూటీ మేయర్కు ఘనంగా స్వాగతం పలికారు. బోనాల సందర్భంగా తార్నాకలోని పలు ఆలయాల్లో నిర్వహించిన వేడుకల్లో డిప్యూటీ మేయర్ పాల్గొని పూజలు నిర్వహించారు.
బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. తుల్జా భవాని వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రెండు వందల కుటుంబాలు పెద్ద ఎత్తున బోనాలతో ఉత్సవాల్లో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సంగయ్య స్వామి, రామప్ప, తుకారాం, సునీల్, జగన్నాథ్, అనిల్, సుభాష్, శ్రీకాంత్, లక్ష్మణ్, ప్రకాశ్ పాల్గొన్నారు.
నియోజకవర్గంలో ఆదివారం బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. కంటోన్మెంట్లోని బోయిన్పల్లి, తాడ్బంద్, రసూల్పూరా, మారేడ్పల్లి, పికెట్, వాల్మికినగర్, బూసారెడ్డి గూడ, టీచర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం నుంచి మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి ఆలయాలకు బోనంతో చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి తన మొక్కులను సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాకులు చిర్రబోయిన కృష్ణయాదవ్, తిరుమల వంశీ అన్ని ఏర్పా టు చేశారు. కంటోన్మెంట్లోని మారేడ్పల్లి, పికెట్, లక్ష్మినగర్, వాల్మికినగర్, కాకాగూడ, రసూల్పూర, బో యిన్పల్లిలోజరిగిన బోనాల ఉత్సవాల్లో కార్పొరేషన్ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జెల నాగేశ్, కంటోన్మెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీ గణేశ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గణేశ్, సామాజిక వేత్త తేలుకుంట సతీశ్గుప్తా , కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని పూజలు చేశారు.