బేగంపేట్ ఫిబ్రవరి 12: ఆపద సమయంలో తమకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకున్నాడని, గొప్ప మనసున్న నాయకుడు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అని రాంగోపాల్పేట్ డివిజన్ కాచ్బౌలి ప్రాంతానికి చెందిన బస్తీవాసులు పేర్కొన్నారు. ఆదివారం మారేడ్పల్లిలో మంత్రిని కలిసి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. గత నెల 19న సికింద్రాబాద్ మినిష్టర్ రోడ్డులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పలు కుటుంబాలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించి 20 రోజుల పాటు వసతి, భోజన సౌకర్యం కల్పించారు. అలాగే తమ ఇండ్లకు అవసరమైన మరమ్మతులు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టారని, ఆర్థిక సహాయం అందించారని హర్షం వ్యక్తం చేస్తూ ఆ కాలనీ ప్రజలు మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ…నియోజకవర్గ పరిధిలో ప్రజలకు తాను ఎళ్లవేళలా అండగా ఉంటానని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరిస్తానన్నారు. మంత్రిని కలిసిన వారిలో డీవీ కాలనీలో ప్యారడైజ్ గగన్ అపార్ట్మెంట్కు చెందిన కరణ్చౌడ, వినోద్ చౌబారియా, రాజేశ్, జగదీశ్, కల్పన రాఖీ, కాచ్బౌలికి చెందిన శ్రీకాంత్, వెంకట్ బస్తీ వాసులున్నారు.