హైదరాబాద్: ఫైర్సేఫ్టీ పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ బాగ్లింగపల్లిలోని వీఎస్టీ వద్ద ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు. అధికారులను ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిందన్నారు. ప్రజలలో అవగాహన కల్పించే విధంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని చెప్పారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని వెల్లడించారు.