హైదరాబాద్: నగరంలోని బన్సీలాల్పేట మెట్లబావి పునరుద్ధరణ పనులను మరో 15 రోజుల్లో పూర్తిచేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెలాఖరు లోపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మెట్లబావిని ప్రారంభిస్తామన్నారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి మెట్లబావి పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.
మెట్లబావితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దీనిని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తద్వారా ఇక్కడివారికి ఉపాధి కల్పిస్తామన్నారు. మెట్లబావి పునరుద్ధరణతో నీటి సమస్య తీరుతుందన్నారు.