చిక్కడపల్లి, ఏప్రిల్ 7 : దేశంలో ఏ పార్టీకి బీజేపీని ఎదుర్కొనే శక్తి లేదని కేవలం సీఎం కేసీఆర్కే ఆ శక్తి ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవారం డివిజన్లోని జవహర్నగర్ కమ్యూనిటీ హాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు రాకుండా ప్రధాన మంత్రి మోదీ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. మతపరమైన రాజకీయాలు చేయడం మానేసి అభివృద్ధి పై పోటీ పడాలన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గడిచిన నాలుగు సంవత్సరాల్లో రాష్ర్టానికి చేసింది ఏమీ లేదని, రాజ్యాసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కనీసం లక్ష రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిన దఖలాలు లేవన్నారు. పేపర్ లీకేజీ విషయంలో కూడా రాజకీయలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముషీరాబాద్లో నియోజకవర్గంలో హేమాహేమీలు రాజకీనాయకులు ఉన్నా గత 40 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే ముఠా గోపాల్ హయాంలో జరిగిందని తెలిపారు.
మనమందరం సీఎం కేసీఆర్ బలగం : దాసోజు శ్రవణ్ కుమార్
మనమందరం సీఎం కేసీఆర్ బలగం అని బీఆర్ఎస్ పార్టీ నగర ఇన్చార్జి దాసోజు శ్రవణ్కుమార్ అన్నారు. బలగం సినిమాలో చూపించిన విధంగా నాయకులు, కార్యకర్తలు మధ్య ఉన్న అంతరాలు పోవడానికే సీఎం కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు కలిసి కట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పండుగలా ఆత్మీయ సమ్మేళనాలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు పండుగలా జరుగుతున్నాయని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రూ.400 కోట్లతో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. కలిసి కట్టుగా అందరం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్కుమార్, ముఠా జయసింహ, పార్టీ నగర మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, వి.శ్రీనివాస్రెడ్డి, రవీందర్, ముఠా నరేశ్, మాచర్ల పద్మజ, ముచ్చకుర్తి ప్రభాకర్, రెబ్బ రామరావు, ముఠా శివసింహ, ఎర్రం శ్రీనివాస్ గుప్త, గుండు జగదీశ్ బాబు, పోతుల శ్రీకాంత్, రవిశంకర్గుప్త, పీ.ఎస్.శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, పున్న సత్యనారాయణ, సరస్వతి, స్వరూప, మంజుల, తదితరులు పాల్గొన్నారు.