బన్సీలాల్పేట్, అక్టోబర్ 26 : గత తొమ్మిదేండ్లలో సనత్నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్ వన్గా నిలిచిందని, అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బన్సీలాల్పేట్ డివిజన్లోని న్యూబోయిగూడలోని గొల్లకొమరయ్య కాలనీ, గాంధీనగర్ కాలనీ, సీసీనగర్ ఫేజ్-2, బర్కాల బస్తీ, రామస్వామి కాంపౌండ్ బస్తీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా బస్తీల్లో ఆయనకు మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు.
శీనన్నా మీదే గెలుపు అంటూ ఆయనను ఆశీర్వదించారు. అనంతరం ఆయన గాంధీనగర్ కాలనీ ప్రధాన రహదారిలో డివిజన్ ఎన్నికల కార్యాలయాన్ని కార్పొరేటర్ కే.హేమలత, కే.లక్ష్మిపతి, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలను గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. బన్సీలాల్పేట్ డివిజన్ బస్తీల రూపురేఖలు గత తొమ్మిదేండ్లలో మారిపోయాయన్నారు.
మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మాణం, ఐడీహెచ్ కాలనీ, జీవైఆర్, పీఎస్నగర్, బీఎం నగర్, సీసీనగర్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ నిర్మాణాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మిపతి, జీ.పవన్కుమార్ గౌడ్, అరుణ్ గౌడ్, ప్రేమ్కుమార్, దేశపాకశ్రీను, రాజేందర్, జ్ఞాని, రజాక్, ఫహీమ్, అబ్బాస్, చాంద్, విజయ్శంకర్, కేఎమ్.కృష్ణ, కమల్కుమార్, శ్రీనివాస్, చిన్నా, శ్రీలక్ష్మి, విజయ, సీమ పాల్గొన్నారు.