బేగంపేట్, డిసెంబర్ 13: ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే ప్రభుత్వ సంక ల్పం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం తరఫున సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ చర్చీల ప్రతినిధులకు పేద క్రిస్టియన్లకు పంపిణీ చేసేందుకు క్రిస్మస్ గిఫ్ట్లను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పండుగపూట పేదలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గిఫ్ట్ల పంపిణీతో పాటు గొప్ప విందును సైతం ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. చర్చీలు, గ్రేవ్యార్డ్ల అభివృద్ధికి అత్యధిక నిధులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు శేషుకుమారి, అరుణగౌడ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, బాల్రెడ్డి, హరికృష్ణ,రాజుతో పాటు వివిధ చర్చిల ప్రతినిధులు ప్రశాంత్, జయరాజ్, దయాకర్, సుదర్శన్ పాల్గొన్నారు.