బేగంపేట్ నవంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలే బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు దోహద పడతాయని మం త్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్, రాంగోపాల్పేట్, బన్సీలాల్పేట్ డివిజన్లలో సోమవారం ఇంటిం టా ప్రచారం నిర్వహించారు. వీటితో పాటు వివిధ అసోసియేషన్లు నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓ వైపు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని కూడా ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజలు వారే వివరిస్తున్నారన్నారని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని కులమతాలకు వారి నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ తొమ్మిదిన్నరేండ్లలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కండ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు.
సమస్యలు అనేవి నిరంతరంగా ఉంటాయి. కాబట్టి, మరోసారి తనను అధిక మెజార్టీతో గెలిపిస్తే మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. సంక్షేమ ఫలా లు, డబుల్ బెడ్రూం ఇండ్లు రాని వారు ఏ మా త్రం బాధపడొద్దని బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి ఏర్పాటయ్యాక తప్పకుండా ఇండ్లు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్పై నమ్మకంతో ఉండాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 70వేల మందికి ఇండ్లను పంపిణీ చేశామన్నారు. మరో 30 వేలు నిర్మాణం జరుగుతున్న విషయాన్ని వివరించారు. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామని సంక్షే మ పథకాలు అందని వారు బాధపడవద్దని రాబోయే కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు.