బేగంపేట్ సెప్టెంబర్ 17: టీఆఎర్ఎస్ పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని, కార్యకర్తలే పార్టీకి ప్రాణవాయువని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో శుక్రవారం టీఆర్ఎస్ సనత్నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ… నియోజకవర్గంలో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందు కు సాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. డివిజన్లో కార్యకర్తలు తలెత్తుకునే విధంగా అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పారు.
నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.2 కోట్లు అందించిందని, పాఠశాలల్లో గుర్తించిన సమస్యలను త్వరలోనే జిల్లా విద్యాశాఖాధికారి చేతుల మీదుగ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. అవసరమైన చోట సీసీ కెమరాల ఏర్పాటుకు కూడా కోటి రూపాయల నిధులు వెచ్చించినట్టు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి త్వరలోనే పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. బన్సీలాల్పేట్ డివిజన్లో మిగిలిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కూడా దసరా, దీపావళి వరకు లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని అన్నారు. మారేడ్పల్లి నుంచి బన్సీలాల్పేట్ బైబిల్ హౌజ్, రాష్ట్రపతి రోడ్డు, జీరా, హైదర్బస్తీ, టకార బస్తీ ప్రాంతాల్లో ఉన్న లీజ్ స్థలాల ఫ్రీహోల్డ్ చేసే ప్రక్రియ కూడా మంత్రి కేటీఆర్తో మాట్లాడుతున్నామని, త్వరలోనే ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. నగరంలో ప్రధానంగా అండర్పాస్లు, వైకుంఠధామాలు, రోడ్లు, పార్కులు, సివరేజ్, డ్రైనేజ్ లైన్స్, తాగునీటి సరఫరా.. ఇలా నగరంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తుందన్నారు.
గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న తరుణంలో లోటు పాట్లను సరిదిద్దుకుంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, ముఖ్య నాయకులు పీఎల్ శ్రీనివాస్, కూన వెంకటేశంగౌడ్, గుర్రం పవన్కుమార్గౌడ్, కార్పొరేటర్లు మహేశ్వరి, లక్ష్మీబాల్రెడ్డి, హేమలత, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, ఉప్పల తరుణి, శేషుకుమారి, డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ, సెప్టెంబర్ 17: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలే తిప్పి కొట్టి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. టీఆర్ఎస్ బోరబండ డివిజన్ నూతన కమిటీని శుక్రవారం నియమించారు. బోరబండ సైట్-1 కాలనీ తుర్రెబాజ్ఖాన్ కమ్యూనిటీహాల్లో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు క్రమశిక్షణతో సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తుందన్నారు. తక్కువ వ్యవధిలో బోరబండ ఇంతగా అభివృద్ధి చెందటానికి బాబా ఫసియుద్దీన్ కృషి ఎంతగానో ఉందన్నారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉన్నదని, ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే తెలియజేయాలన్నారు.
బోరబండ డివిజన్ అధ్యక్షునిగా కృష్ణమోహన్ను వరుసగా 3వ సారి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా భూపతిరెడ్డి, కె.రవీందర్, అజయకుమారి, మహేశ్గుప్తా, జీవన్నాయక్, ఎ.సత్తాజీ, జి.వెంకట్రెడ్డి, ఎం.సుధాకర్, ప్రధా న కార్యదర్శులుగా శంకర్, ధనలక్ష్మి, రవినాయుడు, కోశాధికారిగా జి.నర్సింహయాదవ్, కార్యదర్శులుగా శ్రీనివాస్రెడ్డి, ఎన్.శంకరయ్య, టి.సరళ, ఎం.భాగ్యలక్ష్మి, కె.వినోద్కుమార్, సంయుక్త కార్యదర్శులుగా శంకర్నాయక్, ఎస్.పర్వతాలు, పి.శశిధర్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా షేక్ వలి, దేవమణిగౌడ్, పార్వతి, రుద్ర సూర్యకళ, ఆంజనేయులు, ప్రచార కార్యదర్శులుగా ఎజాజ్బేగ్, వెంకటేశ్, ఆదిల్ అహ్మద్, పి.పరుశురాం, మరో ఐదుగురు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నియమితులయ్యారు.
కె.బాబూరావు(యూత్ విభాగం), స్వాతి చౌదరి(మహిళా సెల్), హెచ్.రమేశ్యాదవ్(బీసీ సెల్), జీడీ ధర్మేంద్ర(ఎస్సీ సెల్), ఎండీ నసీరుద్దీన్(మైనార్టీ సెల్), ఎన్.బాబానాయక్(ఎస్టీ సెల్).