బేగంపేట్, జూలై 14 : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాంగోపాల్పేట్ డివిజన్లోని గైదీన్బాగ్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణతో కలిసి బుధవారం పర్యటించారు. స్థానికులు ఆయనకు తమ సమస్యలను వివరించారు. పాత జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో నిర్మించిన ఇండ్లు సరిపోవడం లేదని, ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లల్లో తమకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు. అలాగే, బస్తీలోని అమ్మవారి ఆలయం కూడా పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో మరోసారి ఆర్డీవో, తహసీల్దార్ , జీహెచ్ఎంసీ హౌసింగ్ అధికారులతో కలిసి పర్యటించి, సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి స్థానికులకు హామీ ఇచ్చారు.