నాంపల్లి, అక్టోబర్ 18: గత ఉప ఎ న్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ టల రాజేందర్, రఘునందన్రావు కేం ద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి వారి ని యోజకవర్గాలను అభివృద్ధి చేశారో చెప్పాలని పశుసంవర్ధక శాఖ మంత్రి త లసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ము ఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. ఫ్లోరోసిస్ సమస్యను సీఎం కేసీఆర్ శాశ్వతంగా రూపుమాపారన్నారు. టీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రగతితో గ్రామాల్లో డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు నిర్మించినట్లు చెప్పారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తు న్న కేసీఆర్ వైపే ఆయా రాష్ర్టా ప్రజలు చూస్తున్నారన్నారు. అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యేతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఎక్కడి నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం కృష్ణారెడ్డి, జిల్లా నాయకుడు పానుగంటి వెంకన్నగౌడ్, సీపీఐ నాయకులు నాంపల్లి చంద్రమౌళి, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు కోరె ప్రమీల, నాంపల్లి సత్తయ్య, కమిషెట్టి పండు, గౌరు కిరణ్, కర్నె యాదయ్య, సంగెపు గణేశ్ పాల్గొన్నారు.