మారేడ్పల్లి, డిసెంబర్ 19: నూతన సంవత్సరంలో పేద ప్రజల కల సాకారం కానుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మారేడ్పల్లిలోని న్యూ క్లబ్లో క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాశ్రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ లీజు స్థలాల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 760 ప్రభుత్వ లీజు స్థలాలు ఉన్నాయని, సుమారు 2600 కుటుంబాలు ఆ స్థలాల్లో నివసిస్తున్నాయని తెలిపారు. వారిలో 700 మందికి జీఓ 816 కింద రెగ్యులరైజ్ చేశామని, వివిధ కారణాలతో మిగిలిన వారు దరఖాస్తు చేసుకోలేక పోయారని చెప్పారు.క్యాబినెట్ సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లగా, దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అమయ్ కుమార్, సీసీఎల్ఏ అధికారి కిషన్రావు, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్టేట్ ఆఫీసర్ ఆదిలక్ష్మి, న్యూ క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాశ్రావు, వైస్ ప్రెసిడెంట్ మహేందర్, ట్రెజరర్ మధుసూదన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.