హైదరాబాద్ : విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని అమీర్ పేట, సనత్ నగర్లలో స్విమ్మింగ్ పూల్స్ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలన్నారు.
ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేలా అనేక అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. క్రీడలతో మానసికంగా, శారీరకంగా ఎంతో ధృడంగా ఉంటారన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.