హైదరాబాద్ : ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు దళిత బంధు ఆర్థిక సహాయం అందించేందుకు సమగ్ర విచారణ జరిపి అర్హులను ఎంపిక చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి 2 వ విడత దళిత బంధు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..సమగ్ర విచారణ జరిపివారం రోజుల్లో దరఖాస్తులను అధికారులకు అందజేయాలన్నారు. లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లనే అందజేయాలి. మొదటి విడతలో ఇచ్చిన యూనిట్ లపై కూడా పర్యవేక్షణ తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్, జిల్లా కలెక్టర్, అధికారులుపాల్గొన్నారు.