Minister Srinivas Yadav | ప్రతిపక్షాలు, ప్రశ్నించిన వ్యక్తులను దర్యాప్తు సంస్థలతో కేంద్రం వేధింపులకు గురి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఉప్పల్ భగాయత్లో జైన భవన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు సుభాష్రెడ్డి, సుధీర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలో కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరన్నారు. రూ.1200కోట్ల ప్రభుత్వ నిధులతో ఎంతో అద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించారన్నారు. బోనాల ఉత్సవాలకు ఎండోమెంట్ పరిధిలోని ఆలయాలకు సైతం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జైన భవన కోసం కేసీఆర్ రెండెకరాల భూమిని కేటాయించారన్నారు. జైన సమాజ్ మహావీర్ హాస్పిటల్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించి లీజుపై ఉన్న స్థలాన్ని హాస్పిటల్ కే కేటాయించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు.