కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 2 : నిరుద్యోగికి ఉద్యోగం కుటుంబానికి భరోసానిస్తుందని రాష్ట్రంలోని పేదలందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం కూకట్పల్లి ట్రక్ పార్కు ఆవరణలో తెలంగాణ యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, ఎమ్మెల్యే కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మేళాను మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.
ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ..మినీ హైదరాబాద్ లాంటి కూకట్పల్లిలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్మేళాను నిర్వహించినట్లు తెలిపారు. 109 కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాలో భాగస్తులయ్యారని, సుమారు 8వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తే కుటుంబమంతా భరోసాగా జీవిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధిని సాధించిందని తెలిపారు. నగరానికి గుండెకాయ లాంటి కూకట్పల్లిలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించిందన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వకున్నా రాష్ర్టాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాలకు చెందిన ప్రజలందరూ హైదరాబాద్లో నివసించేందుకు ఇష్టపడుతున్నట్లు తెలిపారు. మహబూబ్నగర్ అత్తగారిైల్లెతే.. కూకట్పల్లి తల్లిగారిల్లని కూకట్పల్లి అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణారావు నాయకత్వంలో కూకట్పల్లిలో ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో జాబ్మేళాను నిర్వహించినట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. ఈ జాబ్మేళాలో అర్హత సాధించిన వారికి వెంటనే ఉద్యోగ నియామక సర్టిఫికెట్లను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీలు చంద్రశేఖర్, ధనలక్ష్మి, డీసీ రవికుమార్, కోఆర్డినేటర్ సతీశ్అరోరా, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబురావు, సబీహా గౌసుద్దీన్, పండాల సతీశ్గౌడ్, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్రెడ్డి, జూపల్లి సత్యనారాయణ తదితరులున్నారు.