శంషాబాద్ రూరల్, ఆగస్టు 8 : ఫొటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో( లూయిస్ జాక్విన్ మాంజ్ ఫొటోగ్రఫీ వ్యవస్థాపకుడు) జయంతి సందర్భంగా ఫొటోగ్రాఫర్లు రంగారెడ్డి జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర సాధనలో కలిసి పని చేసిన ఫొటో గ్రాఫర్లను ఆదుకోవడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, గుర్తింపు కార్డు అందిస్తామని తెలిపారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జి ల్లాలో ఫొటోగ్రాఫర్ల భవనానికి స్థలం కేటాయించి, నిర్మాణం చేసి ఆదుకున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి,కాలే యాదయ్య, జైపాల్యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ నాయకుడు మల్లేశ్, శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్, వెంకటేశ్ గౌడ్, ఫొటోగ్రాఫర్ల రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్, వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శివలింగంగౌడ్, ఉపాధ్యక్షులు యాదగిరి, శేఖర్గౌడ్, విష్ణుగౌడ్, మహేందర్గౌడ్ పాల్గొన్నారు.