సుల్తాన్బజార్, ఫిబ్రవరి 2 : దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం నాంపల్లి గృహకల్ప ఆవరణలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేనివిధంగా కంటి వెలుగు కార్యక్రమం మన రాష్ట్రంలోనే కొనసాగుతున్నదని తెలిపారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ కంటి వెలుగు కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల హెల్త్ స్కీంలో మార్పులు చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది ఉద్యోగులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, సభ్యులు ఉమాదేవి, శైలజ, నగర శాఖ అధ్యక్షుడు శ్రీరామ్, కార్యదర్శి శ్రీకాంత్, నాల్గవ తరగతి కేంద్ర సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్.విక్రమ్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్కుమార్, ఉపాధ్యక్షులు ఉమర్ఖాన్, సభ్యులు ముఖీం ఖురేషి, శ్రీధర్, వైదిక్ శస్త్ర, వెంకటేశ్, వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.