రవీంద్రభారతి, సెప్టెంబరు 21: తెలంగాణ ప్రభుత్వం గౌడ సామాజిక వర్గానికి వైన్షాపుల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్లను కేటాయించినందుకు గౌడ జన హక్కల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గౌడ్ల సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. గౌడ వృత్తిదారులు సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నారన్నారు. వృత్తి పన్ను రద్దు చేయడంతో పాటు ప్రమాదవశాత్తు గీతవృత్తిలో గాయపడిన, చనిపోయిన కార్మికులకు చెల్లించే ఎక్స్గ్రేషియాను పెంచి అండగా నిలిచారన్నారు. ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు వైన్షాపుల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్లు కల్పిం చి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో రాగుల సిద్ధి రాములు గౌడ్, బాలసాని సురేష్ గౌడ్, పల్లె ఉపేందర్ గౌడ్, మహేశ్వర్ గౌడ్, శ్యాంరావు గౌడ్, కదిరె ఆంజనేయులు గౌడ్, రాగుల కిరణ్ కుమార్ గౌడ్, పన్యాల మమతా గౌడ్, ఎం.శైలజ గౌడ్, మంద రామారావు గౌడ్, సాయిగౌడ్, వీరాస్వామి గౌడ్, బిక్షపతి గౌడ్ పాల్గొన్నారు.