చాదర్ఘాట్, జనవరి 4 : చాలా కాలంగా పెండింగ్లో ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం లూయిస్ బ్రెయిలీ 215వ జయంతిని పురస్కరించుకుని మలక్పేటలోని నల్గొండ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి మంత్రి సీతక్క పూలమాలల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ అంధుల ఆరాధ్యదైవం సర్ లూయిస్ బ్రెయిలీ అని పేర్కొన్నారు.
కంటి చూపు కోల్పోయినా పట్టుదలతో ఆరు అక్షరాల లిపిని కనుగొని ప్రపంచ వ్యాప్తంగా అంధులకు దిక్సూచిగా నిలిచాడని అన్నారు. మెట్రో రైల్లో మాదిరిగా ఆర్టీసీ బస్సులో బస్స్టాప్ వచ్చే ముందు ప్రకటన చేసే విధంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అంధులకు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన అంధులను మంత్రి సీతక్క సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అహ్మద్ బలాల, ముఖ్యకార్యదర్శి వాకటి కరుణ, సంక్షేమ శాఖ ఇన్చార్జీ డైరెక్టర్ కేఆర్ఎస్ లక్ష్మి, ఏడీ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల చెకోలేకార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.