సైదాబాద్, నవంబర్ 27: సైదాబాద్లోని తెలంగాణ జువైనల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్టుమెంట్ డైరెక్టర్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
జువైనల్ హోం డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రజా అలీబేగ్, గోపికుమార్ ఆదివారం రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను కలిసి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. గాజులరామారంలో ఏర్పాటుచేస్తున్న పెట్రోల్ పంపు నిర్మాణ పనులకు, స్పెషల్ హోంఫర్ బాయ్స్ భవన నిర్మాణానికి, నిజామాబాద్ అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.